25.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుపై నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలు జోగి రమేశ్‌, దేవినేని అవినాష్‌ సహా 24 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌ సహా 20 మందికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వాదనల అనంతరం జోగి రమేశ్‌, దేవినేని అవినాష్‌ దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్‌, దేవినేని అవినాష్‌ సహా 24 మందికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్