పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. పిన్నెల్లిపై ఆంక్షలు విధించింది. ఆయన మంగళవారం కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దని ఆదేశించింది. పిన్నెల్లి కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన వీడియో గురించి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ ఘటనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయగా.. పిటిషనర్ తరఫు లాయర్లు ఈవీఎంవను ద్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వెబ్కా స్టింగ్ వీడియోలను ధర్మాసనానికి ప్రదర్శించారు. వెంటనే స్పందించిన ధర్మాసనం దీనికి ఏం సమాధానం చెబుతారని పిన్నెల్లి తరఫు లాయర్ను ప్రశ్నించింది. ఓ ప్రజాప్రతినిధిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి.. ఇలా ఈవీఎంను ధ్వంసం చేయడం ఏంటి? అని ప్రశ్నించింది. పిన్నెల్లి లాయర్ ఈ ఘటన గురించి తాము ఏమీ చెప్పాలనుకోవడం లేదనడంతో.. ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లి కౌంటింగ్ జరిగే కేంద్రం పరిసరాలలోకి రాకూడదని, దీనికి ఒప్పుకుంటున్నట్లుగా అఫిడవిట్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.


