24.6 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

విద్యార్థి బలవన్మరణం.. కన్నీరు తెప్పిస్తున్న సూసైడ్ నోట్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: శ్రావణి అనే యువతి హిందూపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఇకపోతే, ఈ యువతి ఉన్నట్టుండి ఇటీవల బాత్రూమ్ లో అపస్మారక స్థితిలో కనిపించింది. గమనించిన తోటి విద్యార్థినులు షాక్ గురయ్యారు. వెంటనే కాలేజీ యాజమన్యానికి సమాచారం ఇవ్వడంతో అంతా అక్కడికి చేకుకున్నారు. అనంతరం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆ యువతి చనిపోయే ముందు రాసిన ఓ సూసైడ్ నోట్ అందరి చేత కన్నీరు పెట్టిస్తుంది. ఇంతకు ఆ అమ్మాయి అందులో ఏం రాసిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలోని మామిళ్ల గ్రామానికి చెందిన శ్రావణి (18) హిందూపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ యువతి ఇక్కడే హాస్టల్ లో ఉంటూ చదువుకునేది. ఇదిలా ఉంటే.. శ్రావణి గత కొంత కాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

 

ఆమెకు ఆపరేషన్ చేయడానికి తల్లిదండ్రుల వద్ద అంత స్థోమత లేకపోవడంతో శ్రావణి తరుచు బాధపడేది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆ విద్యార్థిని మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని వెంటనే ఆ యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ తాజాగా మరణించింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇకపోతే.. ఆ యువతి చనిపోయేముందు ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచింది. అందులో ఏముందంటే? నేను గత కొంత కాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నాను.. నా తల్లిదండ్రుల వద్ద ఆపరేషన్ చేయించే స్థోమత లేదు. పైగా నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. ఇక నేను నా తల్లిదండ్రులకు భారం కాకూడదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆమె అందులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతురాలి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్