మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణహాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఆయన అభ్యర్థునను నిరాకరిం చింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్కు గన్ మెన్లు అవసరమో? లేదో? తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశిస్తూ… తదుపరి విచారణను మార్చ్ 19కి వాయిదా వేసింది.


