27.8 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

ఏపీలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు …. దాడుల్లో పలువురికి గాయాలు

   సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అయితే, ఈ గొడవలకు కారణం మీరంటే మీరంటూ వైసీపీ నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.

   గొడవలు, దౌర్జన్యాల విషయంలో వైసీపీ నేతలు చెబుతున్న దాని ప్రకారం. దర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పోలింగ్ సందర్భంగా దౌర్జన్యాలకు దిగారు. దర్శి మండలంలోని బొట్లపాలెంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. ఈ సందర్భంగా ఓ ఈవీఎం కిందపడిపోయింది. దేవరంలోనూ పోలింగ్ ఏజెంట్ల మధ్య స్వల్ప గొడవ చోటు చేసుకుంది.

  మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు వద్ద టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. పోలింగ్ జరుగు తున్న నేపథ్యంలో సరళిని గమనించేందుకు వచ్చారు వైసీపీ అభ్యర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ సంద ర్భంగా తాము సైతం లోపలికి వెళ్తామని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రం గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలోనే టీడీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయి పోలీసులను నెట్టి వేయడంతో పరిస్థితి కొంత సేపు ఉద్రిక్తంగా మారింది.అటు అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. గుత్తిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. అంతేకాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారని ఆరోపించారు వైసీపీ కార్యకర్తలు. ఇదేమని ప్రశ్నించిన వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు టీడీపీ నేతలు అంటున్నారు వైసీపీ నాయ కులు. కర్నూలులోని 17వ వార్డులో టీడీపీ ప్రలోభాల పర్వానికి తెరతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగు దేశం కార్పొరేటర్ పద్మలతారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని ఓటు వేయాలంటూ ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు. ఇది ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపిస్తున్నారు.

   కృష్ణా జిల్లాలోని బావులపాడులో జనసేన, టీడీపీ నాయకులు ఓవర్ యాక్షన్ చేసినట్లుగా చెబుతున్నారు వైసీపీ నాయకులు. పోలింగ్ బూత్ వద్ద ఉదయం నుంచే ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా పరిధిలోని దెందులూరు నియోజకవర్గం పెదవేగి గ్రామంలో టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారన్నారు వైసీపీ నేతలు. పోలింగ్ బూత్ నెంబర్ 54లోకి ఒక్కసారిగొ చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. గొడవ జరగడంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు భయాందోళనలకు గుర య్యారు. చివరు పారామిలటరీ బలగాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

  నందికొట్కూరు పట్టణంలోని 46,47,48 పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి హల్‌ చల్ చేశారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లను పక్కకు పిలిచి ఓటు వేయాలంటూ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారంటూ మాండ్ర శివానందరెడ్డిపై మండిపడ్డారు వైసీపీ నేతలు. దీంతో పోలీసులు వచ్చి వంద మీటర్ల బయటే ఉండాలంటూ మాండ్ర శివానందరెడ్డికి చెప్పడంతో కాస్త వాగ్వాదం తర్వాత బయటకు వెళ్లారు టీడీపీ నేత. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీ ఇజం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నాయకులు. మండికృష్ణాపురం పంచాయతీలో తెలుగుదేశం నాయకుల అరాచకాలు సృష్టించా రని ఫైరయ్యారు. వైసీపీ బూత్ ఏజెంట్స్‌పై కత్తితో దాడి చేసి పరార య్యారని చెబుతున్నారు. ఓటమి భయంతోనే ఇలా చేశారని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. బద్వేల్ టీడీపీ కార్యాలయం వద్ద కూటమి నాయకులు ఘర్షణ పడడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. అగ్రహారం గ్రామానికి సంబంధించి ఓటర్లు డబ్బు మేము పంచుతామంటే.. మేం పంపిణీ చేస్తామని వారిలో వారే వాగ్వాదానికి దిగారు. ఈ సంద ర్భంగా జనసేన, టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఎంటరై ఇరువర్గాలను అదుపు చేయాల్సి వచ్చింది.

   మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. ఏజెంట్లపై దాడులు, ఇతరత్రా గొడవలతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండపం పాపక్కగారి పల్లె పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారని మండిపడుతున్నారు టీడీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను బలవంతం గా బయటకు లాగేశారని అంటున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ ఘటనపై తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు లతో ఈసీ స్పందించింది. వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అదనపు బలగా లను తరలించేలా చూడాలంటే సంబంధిత అధికారులను ఆదేశించింది.

  వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం గులవలూరులో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాగేశారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వైసీపీ నేతలు గుంపులుగా రావడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. తమ వారిని పోలింగ్ కేంద్రాలకు చేరుకోకుండా నిరోధించేందుకు ఎక్కడో విడిచిపెట్టారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని కంభంపాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసు కుంది. ఈ క్రమంలోనే వేటకొడవళ్లు, గొడ్డళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారని చెబుతు న్నారు టీడీపీ నాయకులు. తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఐజీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలిలో ఎస్సై జగదీశ్వర్ రెడ్డి అత్యు త్సాహం ప్రదర్శించారని ఆరోపించారు టీడీపీ నాయకులు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరకు ఇతర పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణి గింది. మొత్తంగా చెదురుమదురు ఘటనలు, ఓ మోస్తరు గొడవలు జరిగినా వెంటనే సర్థుకోవడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్