స్వతంత్ర, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ లో ఆదివారం ఘోరంగా హత్యగావింపబడిన యువతి శిరీష డెత్ మిస్టరీ వీడింది. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అత్యంత పాశవికంగా హత్యగావింపబడిన ఈ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. శిరీష అక్క శ్రీలత భర్త అనిల్.. ఆమెను అతికిరాతకంగా హతమార్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. శిరీషతో బావ అనిల్ వివాహేతర సంభంధం పెట్టుకున్నారని పోలీసులు తేల్చారు.
శనివారం రాత్రి ఫోన్ ఎక్కువగా వాడుతున్నందున అంటూ శిరీషను ఆమె అన్నయ్య కోపంతో తిట్టాడు. ఆ సమయంలోనే ఇంటికొచ్చిన భావ అనిల్.. శిరీషపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో శిరీష తీవ్ర మనస్తాపానికి చెందింది. ఈ సమయంలో మాట్లాడితే అందరూ చూస్తారని.. అర్థరాత్రి కలుద్దామని చెప్పి, శిరీషను అనిల్ బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత ఇంటినుండి బయటకి వచ్చి గడియ పెట్టింది శిరీష. అక్కడికి వచ్చిన భావ అనిల్.. ఆమెతో మాట్లాడే క్రమంలో గొడవ జరిగింది. ఆ గొడవ చిలికిచిలికి గానివానలా మారింది. ఈ క్రమంలో అనిల్ కోపంతో ఊగిపోతూ శిరీషను అత్యాచారం చేసి, గొంతు కోసి చంపేశాడు.
అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా అనిల్ ను విచారించగా .. పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అనేక ప్రశ్నలను అనిల్ ను అడగగా.. తడబడటం గమనించారు. అనిల్ యే హత్య చేసి ఉంటాడని భావించిన పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో జరిగిన విషయమంతా వెళ్లగక్కాడు. శిరీషను అత్యంత ఆటవికంగా, క్రూరంగా చంపింది తానేనని.. శిరీష గొంతును బ్లేడుతో కోసి చంపేసి, స్క్రూడ్రైవర్తో కళ్లను చిద్రం చేసి, ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న నీటిగుంటలో పడేశానని ఒప్పుకున్నారు.