స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్నాటక ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో మత రాజకీయాలను ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీపై ప్రజలు విసిగిపోయారని.. మాకు ఎవరి మద్దతు అవసరం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో120 స్థానాలకు పైగా గెలుస్తామని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
సొంతంగా అధికారంలోకి వస్తామన్న ఆయన.. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్దులు ఆధిక్యంలో కొనసాగుతున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డీకే శివకుమార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఏఐసీసీ నుంచి కీలక సూచనలు వచ్చాయి. గెలిచిన అభ్యర్దుల్ని బెంగళూరు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గెలిచిన అభ్యర్థులకు భారీగా భద్రత పెరిగినట్లు తెలుస్తోంది.