కాకినాడ జిల్లా తాళ్లరేవులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎంపీపీ రాయుడు సునీతా గంగాధర్ అధికార పార్టీకి రాజీనామా చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, మాజీమంత్రి చిక్కాల రామచం ద్రరావు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దళిత మహిళనైనందుకు పొన్నాడ తనను అడుగడుగునా అవమానించా రని సునీతా ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలంలో వైసీపీ పటిష్ఠం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టా నన్నారు. వైసీపీలో దళిత ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కలేదన్నారు.


