హైదరాబాద్ శివారులో దారుణ హత్యకు గురైన ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ మహేశ్ హత్య కేసులో సంచలన విష యాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 17న మహేశ్ బయటకువెళ్లి తిరిగిరాకపోవంతో ఆయన సోదరుడు విఠల్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. మహేశ్ మృతదేహం NFC నగర్ డంపింగ్ యార్డులో లభ్యమైంది. మృతుడి ఫోన్తోనే ఆయన బంధువులతో నిందితులు వాట్సాప్ చాటింగ్ చేశారు. మహేశ్ ఎక్కడికీ వెళ్లలేదని నమ్మించే ప్రయత్నం చేశారు నిందితులు. మహేశ్ బతికే ఉన్నట్లు, హైదరాబాద్ లో పని ఉండి వచ్చినట్లు నమ్మించారు. తాను సొంత ప్రాంతానికి రావడానికి మరో మూడు రోజులు పడుతుందని మృతిడి ఫోన్ తో నిందితులు వాట్సాప్ చాటింగ్ చేశారు.చివరకు మహేశ్ మృత దేహం లభ్యమైంది. స్థానిక కౌన్సిలర్ మల్లేశ్పై మహేశ్ బంధువులు, తల్లి ఆరోపణలు చేశారు. నింది తులందరినీ కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు. మృతుడు, నిందితుల నివాసాల వద్ద పోలీసు లు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మహేశ్ హత్యపై అనుమానాలు ఉన్నాయని, సరైన విచారణ జరపాలని బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.