30.1 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

MLA Rajasingh | పార్టీ మార్పుపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఇక గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో రాజాసింగ్ చేరుతున్నారంటూ ఇటీవల ప్రచారం జోరుగా సాగగా… ఈ వార్తలపై ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని శనివారం తేల్చి చెప్పారు. తానుఎట్టి పరిస్థితుల్లోనైనా బీజేపీని వీడే ప్రసక్తే లేదన్నారు.

ఓ వర్గంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఇటీవల కాలంలో రాజాసింగ్ పేరు మారుమ్రోగింది. తాను చేసిన ఆ కామెంట్స్ సంచలనంగా మారడంతో ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలో పార్టీ నుండి రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది బీజేపీ. ఈ విషయం జరిగి నెలలు గడుస్తున్నా తన విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మనస్థాపంతో టీడీపీలో చేరబోతున్నారంటూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో సైతం చర్చలు జరిపాడని వార్తలు వినిపించాయి. స్థానిక రాజకీయాలలో ఇలా అనేక ఊహాగానాలు ఉండడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్