25.4 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదు

మరో పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఇరుక్కున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందకు రాహుల్​పై కేసు, రెండేళ్లు జైలు శిక్ష విధించగా.. తాజాగా, మరో పరువునష్టం కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. విషయమేంటనే… ఇటీవల లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ వీర్‌ సావర్కర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా…ఇందుకు స్పందించిన సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌(Satyaki Savarkar) పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. నిరాధారంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన తాత సావర్కర్‌పై ఆరోపణలు చేశారని సత్యకి మండిపడ్డారు. ఒక గొప్ప వ్యక్తిపై రాహుల్‌ తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం అని.. ఈ వ్యాఖ్యలు చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు నిజమని కోర్టులో నిరూపించాలని సావర్కర్‌ సవాల్‌ విసిరారు.

Read Also: చీమలపాడు బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్

Follow us on:  YoutubeKoo Google News

Community-verified icon

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్