సత్యసాయి జిల్లా హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై గుర్తు తెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేటు సమీపంలో స్కూలు బస్సు డ్రైవర్లు బస్సులు ఆపి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడిలో ఓ బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.