24.2 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

మరో 15రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది

మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మరో 15రోజుల్లో కూలిపోబోతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 16మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు చెప్పనుంది. ఈ నేపథ్యంలో షిండే ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందని రౌత్ అన్నారు. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం కూలిపోతుందని కూడా తెలిపారు.

గతేడాది జూన్ నెలలో షిండేతో పాటు 39మంది ఎమ్మెల్యేలు శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ పొత్తు పెట్టుకున్న షిండే టీమ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అనంతరం ముఖ్యమంత్రిగా షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్