స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ వాసులు మరణించారు. సిద్ధిపేట జిల్లా చౌటుపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు కారులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న నలుగురూ మృతి చెందారు. మృతులను కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒకే కటుంబంలోని నలుగురు సోదరులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బ్రేకింగ్: ఔరంగాబాద్లో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు దుర్మరణం
0
340
Previous article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


