25.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

రేవంత్ రెడ్డి వెర్సెస్ సబిత

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి సబిత తనను మోసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్. 2019 ఎన్నికల్లో తనకు అండగా ఉంటానని సబిత హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. తనకు టికెట్ ఇచ్చిన వెంటనే కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్‌లో చేరారని చెప్పారు. అధికారం కోసం సబిత బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవులు అనుభవించారన్నారు. తమ్ముడు లాంటి తనను మోసం చేశారు కాబట్టే కేటీఆర్‌ను నమ్మవద్దని చెప్పానన్నారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. వెనుక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు.. మోసం చేస్తారని కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. తాము ఏం మోసం చేశాం.. ఎవరిని ముంచామో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయనను ఆహ్వానించానన్నారు. ఓ ఆడబిడ్డపై ఇలాంటి మాటలు ఏమిటన్నారు. తమపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించకోవాలని డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్