39.2 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

ఉపశమించిన కరోనా.. దేశంలో కొత్త కేసులు ఎన్నంటే?

Covid cases in India | దేశంలో కరోనా మహమ్మారి శాంతించింది. దేశంలో కరోనా​ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా దేశ వ్యాప్తంగా 5,537 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మృత్యువాత పడ్డారు. గుజరాత్​లో ఇద్దరు చనిపోగా… ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్​ ప్రదేశ్​, బిహార్​, ఉత్తర్​ ప్రదేశ్​లో ఒక్కొక్కరు మృతి చెందారు. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,965కు చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,47,56,616 మందికి కరోనా​ సోకింది. రికవరీ రేట్​ 98.74 శాతంగా ఉంది. ఇక కరోనా టీకాల విషయానికొస్తే.. ఇప్పటివరకు 220.66 (220,66,22,663) కోట్ల కొవిడ్​ టీకాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏదేమైనా ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు ఎక్కువగా గుమిగూడ ఉన్నచోట మాస్క్ తప్పనిసరిగా వాడాలని హెచ్చరించారు.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్