26.6 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి రాహుల్ ప్రశ్నలు

బంగ్లాదేశ్ పరిస్థితులపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మూడు కీలక ప్రశ్నలు సంధించారు. ఢాకాలో అధికార మార్పిడి నేపథ్యంలో దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం వద్ద స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఉందా? అని రాహుల్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. బంగ్లాదేశ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అందుకు అనుగుణంగా మన చర్యలు ఉంటాయని సమాధానం చెప్పారు.

హసీనా రాజీనామాకు కొన్ని వారాల ముందు బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందా? ముఖ్యంగా పాక్ ప్రమేయం ఉందా? అని రాహుల్ అడిగారు. ఈ విషయంలో అప్పుడే ఓ అంచనాకు రాలేమని, విచారణ చేస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. అయితే బంగ్లాదేశ్ ఆందోళనలకు మద్దతుగా ఓ పాక్ దౌత్యవేత్త తన సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్‌ను నిత్యం మారుస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

బంగ్లాదేశ్ నాటకీయ పరిణామాలను న్యూఢిల్లీ ముందే ఊహించిందా? అని రాహుల్ తన మూడో ప్రశ్న అడిగారు. పరిస్థితిని భారత్ గమనిస్తోందని జైశంకర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, పొరుగు దేశం సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్