18.7 C
Hyderabad
Wednesday, January 14, 2026
spot_img

మాజీ కడప ఎస్పీ నుంచి వివేకా కేసు వివరాలు సేకరించిన సీబీఐ

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో సీబీఐ మరింత దూకుడు పెంచింది. వివేకా హత్య జరిగిన సమయంలో కడప ఎస్పీగా పనిచేసిన రాహుల్ దేవ్ శర్మను హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి పిలిపించుకుంది. దాదాపు గంటపాటు సీబీఐ కార్యాయలంలో ఉన్న ఆయన కేసు వివరాలు అధికారులకు అందజేశారు. ఈ క్రమంలో ఆయన్ను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో గతంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలోనూ రాహుల్ సభ్యుడిగా ఉన్నారు. హత్యాస్థలంలో లభించిన ఆధారాలను కుటుంబసభ్యులు రాహుల్‌ దేవ్‌కు అందజేశారు. వాటిపై సీబీఐ అధికారులు ఆయనను ఆరా తీశారు.

మరోవైపు ఈ కేసులో అరెస్టైన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిల సీబీఐ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం భాస్కర్‌రెడ్డికి ఈనెల 29 వరకు, ఉదయ్‌కి ఈనెల 26 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్