29.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

మతాన్ని రాజకీయం చేసేవాళ్లతోనే ఇబ్బంది : పవన్ కళ్యాణ్

స్వతంత్ర వెబ్ డెస్క్: కాకినాడ నగర ముస్లింలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తాను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చానని, తాను మిగతా రాజకీయ పార్టీల నేతల్లా కాకుండా ఒక సోదరుడిలా, ఒక మనిషిగా, ఒక భారతీయుడిగా మాట్లాడతానని స్పష్టం చేశారు. ఏ మతంలోనైనా అతివాద భావజాలాన్ని మన అందరం ఖండించాలని పిలుపునిచ్చారు.

విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి చాలామంది హిందువులు పారిపోయారని, చాలామందిని చంపేశారని.. కానీ భారతదేశంలో మాత్రం హిందువులు, ముస్లింలు కలిసే ఉన్నారని, అది మనదేశ గొప్పదనం అని వివరించారు. కొంతమంది రాజకీయ నాయకుల వల్లనే సమస్యలు, ఘర్షణలు వస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిజంగా మతాన్ని నమ్మేవాళ్లతో ఇబ్బంది లేదని, మతాన్ని రాజకీయం చేసేవాళ్లతోనే ఇబ్బంది అని అన్నారు. “ఈసారి ఎన్నికల్లో ముస్లింలు జనసేనకు మద్దతు ఇవ్వండి.. మీకోసం మరింత పనిచేస్తాను” అంటూ పవన్ కల్యాణ్ ముస్లింలతో సమావేశంలో తన మనోభావాలు వెల్లడించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్