22.3 C
Hyderabad
Thursday, August 28, 2025
spot_img

థ్రిల్లింగ్ మ్యాచులో చెన్నై జట్టుపై పంజాబ్‌దే గెలుపు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించింది. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా సికిందర్ రాజా భారీ షాట్ కొట్టడంతో 3రన్స్ వచ్చాయి. దీంతో పంజాబ్ విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్ డేవాన్‌ కాన్వే 52బంతుల్లో 92 పరుగులతో దంచికొట్టడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులను ధోనీ సిక్సర్లు కొట్టడం అభిమానులను ఫిదా చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, సామ్ కరన్ చెరో వికెట్ తీశారు.

ఇక భారీ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ జట్టులో బ్యాటర్లందరూ సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు ధావన్(28), ప్రభ్‌సిమ్రన్‌(42) మంచి శుభారంభం అందించారు. అనంతరం లివింగ్ స్టోన్(40), సామ్ కరాన్(29) పరుగులు చేసి పంజాబ్ జట్టు విజయాన్ని దగ్గర చేశారు. ఇక చివరి ఓవర్లో 9పరుగులు కావాల్సిన తరుణంలో చెన్నై బౌలర్ పతిరాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో చివర బంతికి మూడు పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న సికిందర్ రాజా సమయస్ఫూర్తిగా ఆడటంతో గెలుపు పంజాబ్ సొంతమైంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్