స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం జగన్పై(CM Jagan) చంద్రబాబు(Chandrababu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సైకో జగన్కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. ఆరు నెలల్లో ఇంటికి పోతాడని టీడీపీ(Tdp) అధినేత చంద్రబాబు చెప్పారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రావులపాలెం మార్కెట్ రోడ్డులో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
మాట్లాడితే నా బీసీలు(Bc), నా ఎస్సీలు(Sc) అంటాడు. మీ బిడ్డను అంటాడు.. మీ బిడ్డ కాదు కేన్సర్ గడ్డ. అది ఏ పార్టుకు వస్తే ఆ పార్టు తీసివేయాలి. ఒక్క చాన్సంటూ వచ్చాడు. ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులే.. గుద్దులు. సమాజాన్ని భయపట్టే స్థితికి వచ్చాడు. నోరు విప్పితే నాకు ఏమీ లేదంటాడు. సాక్షి పేపరు లేదా.. సాక్షి చానల్ లేదా? అబద్ధాలపుట్ట.
చంద్రబాబు ఆలమూరు వద్ద కాన్వాయ్ దిగి ఆర్టీసీ బస్సులో(RTC) ప్రయాణం చేశారు. అందులో ప్రయాణిస్తున్న మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్ల కాలంలో నిత్యావసరాల ధర, కరెంట్, బస్సు చార్జీలు ఎలా పెరిగాయని ఆరా తీశారు. కొండలా కనిపిస్తున్న ఇసుక నిల్వలను చూసి బస్సు ఆపి అక్కడ దిగిపోయారు.