స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ బిడ్డను మిస్సవుతున్నాను అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై హిమాన్షు స్పందించాడు. “నాన్నా… గతంలో మిమ్మల్ని రోజుకు ఒకసారైనా కలిసేవాడ్ని, వారంలో ఒకరోజైనా కలిసి భోజనం చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మిమ్మల్ని వర్చువల్ గా కలవడం, మీ కోసం నెలల తరబడి ఆరాటపడడం చూస్తుంటే ఎంతో అసాధారణంగా అనిపిస్తోంది. కానీ మీరు చెప్పినట్టుగా ‘విజయం తాగ్యాన్ని కోరుకుంటుంది’ అనేది ఇన్నేళ్ల మీ ప్రస్థానానికి నిజమైన గీటురాయిలా నిలుస్తుంది. నేను మీ కొడుకునైనందుకు ఎంతో గర్విస్తున్నాను. నేను ఎంతో మెరుగైన వ్యక్తిగా మారడానికి, మంచి చేయడానికి అదే నాకు అతి పెద్ద ప్రేరణ” అంటూ హిమాన్షు వివరించారు. కాగా, తండ్రీకొడుకుల మధ్య అనుబంధానికి నిదర్శనంలా నిలుస్తున్న ఈ సోషల్ మీడియా పోస్టులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నీ కొడుకునైనందుకు గర్విస్తున్నాను నాన్నా.. హిమాన్షు భావోద్వేగ స్పందన
0
562
Previous article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


