IPLకు ఏ మాత్రం తీసిపోకుండా విమెన్ ప్రీమియర్ లీగ్ లో మహిళా క్రికెట్ ప్లేయర్లు సత్తా చాటుతు న్నారు. ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్, శుబ్మన్ గిల్ , డూ ప్లేసిస్ సిక్సులతో చెలరేగి పోతే WPL లో స్మృతి మందాన, ఎల్లిస్ పెర్రీ వంటి మహిళా ప్లేయర్లు దంచి కొడుతున్నారు. ఒక్క బ్యాటింగ్లోనే కాదు అధ్బుత మైన బౌలింగ్ తో రాధా యాదవ్, జెస్ జొనాస్సెన్ అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. విమెన్స్ డే సందర్భంగా WPLలో సత్తా చాటుతున్న మహిళా ప్లేయర్లపై ప్రత్యేక కథనం.
మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం గత ఏడాది బీసీసీఐ విమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది. రెండో సీజన్ లో భాగంగా ఫిబ్రవరి 23న ప్రారంభమైన WPL.. మార్చ్ 17న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. ఐపీఎల్ లో 10 జట్ల మధ్య పోటీ ఉంటే WPL లో 5 టీముల మధ్య పోటీ జరుగుతుంది. గత ఏడాది టైటిల్ ను ముంబాయి ఇండియన్స్ సొంతం చేసుకోగా ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ గట్టి పోటీని ఇస్తున్నాయి. ఐపీఎల్ ప్లేయర్ల వేలంలో ఆటగాళ్లకు ఉన్న డిమాండ్ WPLలో ఆడే మహిళా ప్లేయర్లకు కూడా అదే స్థాయిలో ఉంటుంది. మహిళా ప్లేయర్లు సైతం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించు కుంటూ తమ ఆటతీరుతో దూసుకెళ్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబాయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 21 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన జెమామా రొడ్రర్స్ ఢిల్లీ గెలుపుకు కారణమైంది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లోబెంగుళూరు కెప్టెన్ స్మృతి మందాన 80 రన్స్ చేసింది. ఇలా మరెన్నో విశేషాలతో విమెన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతుంది.
క్రికెట్ అంటే ఒకప్పుడు కేవలం పురుషులకు మాత్రమే చెందినదన్నట్టుగా ఉండేది. కానీ నేడు మహిళ లు ప్రవేశించని రంగం అంటూ ఏదీ లేదు. అన్ని రంగాల్లో తాము పురుషులతో ఏ మాత్రం తీసిపోమని మహిళా లోకం చాటి చెప్తుంది. మహిళా క్రికెటర్ల ఆటతీరును చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఐపీఎల్ తో సమానంగా WPLకి క్రేజ్ పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.