స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనను అక్కడి స్థానికులు మర్చిపోలేకపోతున్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తొలుత బహానగా ప్రభుత్వ పాఠశాలలో అధికారులు భద్రపర్చారు. అనంతరం భువనేశ్వర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత స్కూల్ను పూర్తిగా శానిటైజ్ చేసి శుభ్రం చేశారు. అయితే ఒకేసారి అన్ని మృతదేహాలను చూడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఈ స్కూలుకు పిల్లలను పంపించేందుకు జంకుతున్నారు.
పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ధైర్యం చేయట్లేదని, వారి తల్లిదండ్రులు కూడా స్కూలుకు పంపించేందుకు నిరాకరిస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్ తెలిపారు. అంతేకాకుండా ఈ పాఠశాలను 65 ఏళ్ల క్రితం నిర్మించడంతో స్కూల్ భవనాన్ని కూల్చాలని యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ శిందే గురువారం స్కూల్ను వెళ్లి పరిశీలించారు. ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది, స్థానికులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అనంతరం కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈ భవనాన్ని శుక్రవారం కూల్చివేశారు. ఈ ప్రదేశంలోనే మరో కొత్త భవనం నిర్మించనున్నారు.
Portions of #Bahanaga High School being demolished
Students & guardians expressed apprehension as it was converted into a temporary morgue for #CoromandelExpressAccident victims.
School to reopen on June 19. pic.twitter.com/X3I2nJwXbD
— Sreyashi Dey (@SreyashiDey) June 9, 2023