26 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునః నిర్మాణం

Secunderabad Railway Station | దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తుంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పునరుద్ధరిస్తుంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఇప్పటికే సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో పనులు అన్నీ చకచకా జరుగుతున్నాయి. 719 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ(Modi) ఏప్రిల్ 8న శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ పనులను సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పరిశీలిస్తున్నారు. స్టేషన్ పూర్తిగా పునర్నిమితమవడానికి చేపట్టిన పనులన్ని వచ్చే రెండున్నరేళ్లలో పూర్తవనున్నట్లు తెలుస్తోంది. అద్భుత హంగులతో రూపుదిద్దుకున్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) ని చూస్తే రెండు కళ్ళు చాలవు. ఇది రైల్వే స్టేషన్ ఆ.. లేదంటే ఏదైనా టూరిస్ట్ ప్రదేశమని అనిపిస్తుంది. అన్నీ ఆధునిక సదుపాయాలు ప్రజానికులను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. వీటిలో 4 అంతస్తుల్లో కారు పార్కింగ్, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. నూతనంగా నిర్మితమౌతున్న ఈ రైల్వే నిర్మాణం 30 ఏళ్లకు సరిపడ వసతులతో నిర్మిస్తున్నారు.

Read Also: మీసం మెలేసి.. తొడగొట్టి.. చంద్రబాబుకు ధర్మాన సవాల్

Follow us on:   YoutubeInstagram Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్