పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టమన్నని ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా ఆయనతో సన్నిహిత పరిచయం ఉందని.. బాదల్ నుంచి రాజకీయ విలువలు నేర్చుకున్నానంటూ తెలిపారు. దేశంతో పాటు పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేశారని కీర్తించారు. బాదల్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించింది. కాగా పంజాబ్ రాష్ట్రానికి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.