17.2 C
Hyderabad
Sunday, February 15, 2026
spot_img

సత్తెనపల్లిలో పెట్రో బాంబుల కలకలం

    ఏపీలో కౌంటింగ్ దగ్గరపడుతున్న సమయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెట్రో బాంబుల కలకలం రేగింది. రాజుపాలెం మండలం బ్రాహ్మణ పల్లిలో పెట్రో బాంబులు తయారు చేసే ముడి సరుకు లభ్య మైంది. గడ్డి వాములో నిల్వచేసిన పెట్రోల్ , 8 బీరు సీసాలు , 9 మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాకాండతో కేంద్ర ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సీఈసీ ఆదేశాల మేరకు నిఘా పెంచింది పోలీసు శాఖ. ఎల్లుండి కౌంటింగ్‌ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గత కొద్ది రోజులుగా పల్నాడు జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీ మల్లికా గార్గ్ బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో పెట్రో బాంబు ముడి సరుకు దొరకడం కలకలం రేపుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్