22.5 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

కేటీఆర్‌ ముఖ్యమంత్రి అంటే ప్రజలు భరించలేరు- బండి సంజయ్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: మరో రెండు మూడ్రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రాజుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ వైఫల్యాలను కాంగ్రెస్, బీజేపీ ఎండగడుతుంటే.. ఆ పార్టీలపై బీఆర్ఎస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన.. నిజామాబాద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజామాబాద్ సభలో మోదీ.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. వాటిపై బీఆర్ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్​కు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. మంత్రి కేటీఆర్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజలు భరించలేరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్​పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు కేటీఆరే కారణమని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు 2014కు ముందు ఎంత?, ఇప్పుడున్న ఆస్తులెంత? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభానికి ముందు ఎంత?, ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వ్యాపారాలు లేని కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు ఇంత భారీగా ఎందుకు పెరిగాయని.. దేశవ్యాప్తంగా విపక్షాలకు డబ్బు సాయం చేసేంత సంపద కేసీఆర్‌కు ఎక్కడిది? అని బండి సంజయ్ నిలదీశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్