38.7 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ.. మోకాళ్లపై 501 మెట్లు ఎక్కిన మహిళ

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేనాని పవన్ కల్యాణ్(Pavan Kalyan) ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ(Socia Media), వెలుపలా పవన్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ ఓ మహిళ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. కర్నూలు జిల్లా ఆదోనిలో రణమండల ఆంజనేయస్వామి ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి హనుమంతుడ్ని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

 

ఈ ఆలయం ఓ కొండపై కొలువై ఉంది. కాగా, సదరు మహిళ పవన్ కు వీరాభిమాని, జనసేనకు గట్టి మద్దతుదారు. ఆమె రణమండల హనుమాన్ ఆలయం వద్దకు చేరుకునేందుకు మోకాళ్లపై 501 మెట్లు ఎక్కింది. పవన్ కల్యాణ్ సీఎం కావాలన్నదే ఆమె ఆకాంక్ష. ఆ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఎంతో కష్టమైనప్పటికీ ఆమె మోకాళ్లపై కొండ ఎక్కిన తీరు పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్