25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి.. మూడు నెల‌ల మంత్రిగా ప్రమాణస్వీకారం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డిని ఈరోజు రాజ్​భవన్​లో గవర్నర్​ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో రాష్ట్రమంత్రి వర్గంలో మహేందర్​రెడ్డికి చోటు లభించింది. కేబినెట్​ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈటల రాజేందర్​ను బర్తరఫ్​ చేసినప్పటి నుంచి ఖాళీగా కొనసాగుతూ వస్తున్న స్థానాన్ని నేడు మహేందర్​ రెడ్డి భర్తీ చేశారు. పనిలో పనిగా మంత్రి వర్గ విస్తరణను చేపట్టింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని.. ఆ ఖాళీని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. తాండూర్​లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్​ ఎమ్మెల్యే ఫైలట్​ రోహిత్​ రెడ్డికి టికెట్​ ప్రకటించడంతో.. మహేందర్​ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం అభ్యర్థులను ప్రకటించిన రోజునే నిర్ణయం తీసుకున్నారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వడంతో.. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఈ నేపథ్యంలో పార్టీకి మొదటి నుంచి సేవలు అందిస్తోన్న మహేందర్‌ రెడ్డికి మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అధిష్ఠానం నిర్ణయించి మంత్రిగా తీసుకున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్