టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95 వేల 235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. విశాఖ జిల్లాలో పార్టీ కష్టకాలంలో పార్టీగా అండగా ఉండడంతో ఆయనకి ఈ పదవి దక్కింది అని పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.