ఐపీఎల్ లో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) కలకలం రేగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ఆటగాడు సిరాజ్ కు ఓ అజ్ఞాతవాసి ఫోన్ చేసి ఆర్సీబీకి సంబంధించిన అంతర్గాత విషయాలు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి సిరాజ్ ఫిర్యాదుచేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను బుకీ కాదని.. బెట్టింగ్ లకు అలవాటు పాల్పడిన కారు డ్రైవర్ అని తేల్చారు. అతడు బెట్టింగ్ లో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడని.. అందుకే సిరాజ్ కు ఫోన్ చేసి ఆర్సీబీ వివరాలు అడిగాడని వెల్లడించారు. కాగా గతంలో కూడా శ్రీశాంత్, అంకిత్ చవాన్ లాంటి ఆటగాళ్లు ఫిక్సింగ్ ఉచ్చులో పడి క్రికెట్ కెరీర్ ను నాశనం చేసుకున్న సంగతి తెలిసిందే.