స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మహిళా సాధికారతపై బీజేపీ బూటకపు మాటలు చెబుతుండగా, ఒక ఒలింపిక్ పతక విజేత, ఇతర రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి వేధించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో తెలిపారు. ప్రభుత్వం నిరసనకారులపై బలవంతంగా ప్రయోగిస్తోంది కానీ… లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోట్లేదని పేర్కొన్నారు. పతకాలు తెచ్చి దేశం గర్వించేలా చేసినందుకు ఇదేనా రివార్డ్…? అంటూ ప్రశ్నించారు.