తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 1,276 పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 1,276 ఉండగా..ఇందులో తెలుగు సబ్జెక్టుకు 183 పోస్టులు, హిందీ సబ్జెక్టుకు 168 పోస్టులు, ఇంగ్లిష్ సబ్జెక్టుకు180 పోస్టులు, గణితం సబ్జెక్టుకు 231 పోస్టులు, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు142 పోస్టులు, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టుకు 161 పోస్టులు, సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు 202 పోస్టులు ఉన్నాయి. జీత భత్యాలు రూ.45960 మొదలుకొని రూ.124150 వరకు ఉండనుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24 నుంచి మే నెల 24 వరకు అవకాశం కల్పించారు. మొత్తం 1,276 పోస్టులలో 966 పోస్టులు మహిళలకు రిజర్వు చేశారు. 310 పోస్టులు జనరల్ కోటా కల్పించారు.