25.3 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు.. జ్యుడీషియల్‌ ఎంక్వైరీ- చంద్రబాబు

తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు.

డీఎస్పీ రమణ కుమార్‌ బాధ్యత లేకుండా పనిచేశారని చంద్రబాబు సీరియస్‌ అయ్యరు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్‌, గోశాల డైరెక్టర్‌ హరనాథ్‌రెడ్డిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నామని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై జ్యూడీషియల్‌ ఎంక్వైరీకి ఆదేశించామన్నారు.

టీటీడీ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామన్నారు. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయని… వారికి రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తామన్నారు. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పం వారిలో ఉంది… 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని చంద్రబాబు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్