బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే బీజేపీకి అమ్ముకుంటారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కవిత లిక్కర్ స్కాం వల్లే ఎంతోమంది మందుబాబులు తయారయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. హరీష్రావు సిద్ధిపేటను అభివృద్ధి చేస్తే, సిద్ధిపేట ప్రచారానికి కేసీఆర్ ఎందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి ఆయ్యారంటే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లేనని గుర్తుపెట్టుకోవాలన్నారు నీలం మధు. బీజేపీ, బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి ప్రజలను ఏం చేశారని ప్రశ్నించారు.


