35.2 C
Hyderabad
Friday, May 9, 2025
spot_img

గుడ్ న్యూస్.. కేరళను పలకరించిన రుతుపవనాలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: భారత వాతావరణ కేంద్రం దేశ ప్రజలకు శుభవార్త అందించింది. కొన్నిరోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. రుతుపవనాల రాకతో కేరళ తీర ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నిర్ణీత సమయం ప్రకారం అయితే జూన్ 1వ తేదీన రుతుపవనాలు ప్రవేశించాలి. అయితే వారం రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. మరో వారం రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది. అనంతరం రెండు, మూడు రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయని పేర్కొంది. ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఈనెల 8, 9వ తేదీల్లో రుతుపవనాలు తీరాన్ని చేరతాయని వేసిన అంచనాలే నిజం కావడం విశేషం. 2022లో మే 29న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3న రాగా, 2020లో జూన్ 1నే వచ్చాయి. 2019లో జూన్ 8న, 2018లో మే 29న అడుగు పెట్టాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్