24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

‘ప్రాణం తీసిన యువకుడి కామం’

Nagpur |అధిక మద్యం సేవించి మోతాదుకు మించి వయాగ్రా వాడడంతో ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ సంఘటనకు సంభందించిన విషయాలను జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్ ప్రచురించింది. ఈ మెడిసిన్ వాడేటప్పుడు వైద్యుల సలహా, సూచనలు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించింది.

మెడిసిన్ జర్నల్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో గల ఓ వ్యక్తి పీకలదాకా తాగి లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు తీసుకున్నాడు. ఆపై తనతో వచ్చిన మహిళతో రాత్రంత గడిపాడు. ఆ మరుసటి రోజు ఉదయం వాంతులు విపరీతంగా అవుతుండడంతో.. వెంట వచ్చిన మహిళ హోటల్ సిబ్బంది సాయం కోరింది. దీనికి ఆ వ్యక్తి సహాయాన్ని నిరాకరించడంతో గదిలోనే ఉండిపోయారు. మరికాసేపటికి పరిస్థితి తీవ్రతరం కావడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఆసుపత్రికి తీసుకొస్తుండగానే చనిపోయాడని వెల్లడించారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం.. రక్తం గడ్డకట్టడం వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని.. ఆల్కహాల్ తో పాటు వయాగ్రా తీసుకోవడం, గతంలో రక్తపోటు ఉండటం వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది.

Read Also: ఏసీ పేలి.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్