ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వేడి పెరిగింది. రోజు రోజుకు పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కానినాడ జిల్లా కిర్లంపూడి నుండి ర్యాలీగా విజయవాడకు వెళ్తామని తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏ సీటు ఆశించడం లేదన్న ముద్రగడ్డ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ఇస్తున్న చెప్పారు.