28.2 C
Hyderabad
Wednesday, December 17, 2025
spot_img

నూతన పార్లమెంట్ పై ఎంపీ లక్ష్మణ్ ప్రశంసల జల్లు

స్వతంత్ర, వెబ్ డెస్క్: నూతన పార్లమెంట్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశంశల జల్లు కురిపించారు. ఈరోజు ప్రధాని చేత ప్రారంభించబడిన కొత్త పార్లమెంట్ దేశ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తోందన్నారు. భారతీయత ఉట్టి పడేలా పార్లమెంట్ నిర్మాణం ఉందని వ్యాఖ్యానించారు. 2014 తరవాత భారత సంస్కృతిని పెంపొందించేలా మోడీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సెంగోల్ రాజదండం పార్లమెంట్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు.

“కేసీఅర్, నీతి అయోగ్ సమావేశానికి, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ప్రధానిని, గవర్నర్లను అవమాన పరిచేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కు అడుగులకు మడుగులు ఒత్తెలా కేసీఅర్ వ్యవహరిస్తున్నారు. మోడి కి పెరుగుతున్న ఆదరణ ను చూసి ప్రతిపక్షాలు సహించ లేకపోతున్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పోటీ చేస్తే వీళ్లంతా వ్యతిరేకించారు. మోడీని విమర్శించేందుకు ఒక్కటి అవుతున్నారు. వీళ్ళందరికీ మోడి జ్వరం పట్టుకుంది. ఆర్జేడీ స్థాయి మర్చి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య దేవాలయాన్ని అలా పోల్చడం సరైంది కాదు. కేసీఅర్, కేజ్రివాల్ లు చెట్టా పట్టాల వెనుక.. లిక్కర్ కేసు ఉంది. నదులకు నడక నేర్పాడో లేదో కానీ మద్యానికి పరుగులు నేర్పారు కేసీఅర్.” – ఎంపీ లక్ష్మణ్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్