21.2 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

తల్లితో పాటు ఆసుపత్రిలో చేరిన ఎంపీ అవినాష్‌రెడ్డి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్నూలు నగరంలోని విశ్వ భారతి ఆసుపత్రిలో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తన తల్లి శ్రీలక్ష్మితో పాటు చేరారు. ఈ ఉదయం శ్రీలక్ష్మికి ఛాతీనొప్పి రావడంతో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని కోరగా.. అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలించాలని భావించారు. ఈ క్రమంలో సీబీఐ విచారణకు హాజరుకావాల్సిన అవినాష్‌రెడ్డి.. వెంటనే పులివెందుల బయలుదేరి వెళ్లారు. మార్గ మద్యంలో తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద శ్రీలక్ష్మి ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ అవినాష్‌కు ఎదురైంది. ఆ వెంటనే వాహనం దిగిన అవినాష్.. తన తల్లిని చూడడానికి వెళ్లారు. ఆమె ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ లో ఎక్కి హైదరాబాద్‌ వైపు బయలుదేరారు. తన తల్లికి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో కర్నూలు నగరంలోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి కూడా ఛాతీలో సమస్య తలెత్తిందని అదే హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అవినాష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్