21.7 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

Ys Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డిని వదలని సీబీఐ.. మరోసారి సమన్లు జారీ

స్వతంత్ర వెబ్ డెస్క్:  వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) నేడు సీబీఐ కోర్టు ముందుకు హాజరయ్యారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇక ఈ కేసులోనే శివశంకర్ బెయిల్ పై కూడా కోర్టు విచారణ జరపనుంది. ఇవాళ ఒక్కరోజే వివేకా మర్డర్ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ వదలడం లేదు. ఈ కేసులో ఇప్పటికే అనేకసార్లు అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని విచారించిన సీబీఐ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది. ఇక తాజాగా అవినాష్ రెడ్డికి సీబీఐ (CBI) మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టులో హాజరుకావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ అందులో అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల పేర్లను పేర్కొంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని కోర్టు ముందుకు రావాలని సీబీఐ (CBI) ఆదేశించింది. దీనితో ఆయన నేడు సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్