38.7 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

మోదీ-కేసీఆర్‌లది చీకటి బంధం.. రేవంత్ రెడ్డి విమర్శ

స్వతంత్ర వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీయేలో చేరుతానని చెప్పారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్నారు. మోదీ-కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ చెప్పిందే నిజమైందన్నారు.

నిజామాబాద్ గడ్డపై మరోసారి ఈ బంధం బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో కుస్తీ పడుతున్నారన్నారు. ఇన్నాళ్లు తాము చెప్పిందే నిజమైందన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నం చేసింది నిజమే… అలాగే వారిద్దరు మిత్రులేనన్నది అంతకంటే నిజమన్నారు. నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదన్నారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్