Modi tour | తెలంగాణ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ..హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని తన ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా చేరుకున్నారు. అంతక ముందే రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై, బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు అక్కడకు చేరుకొని భారత ప్రధానిని ఆహ్వానించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సికింద్రాబాద్(Secunderabad), పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ భద్రత నిర్వహించారు పోలీస్ అధికారులు. సుమారు 1000 మంది పోలీసులతో ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ.. పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న రూట్ మ్యాప్ వద్ద పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Read Also: విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్
Follow us on: Youtube, Instagram, Google News