28 C
Hyderabad
Thursday, June 19, 2025
spot_img

క్యాన్సర్‌ రోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీష్‌రావు

Miniter Harish Rao | తెలంగాణలోని క్యాన్సర్‌ రోగులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు శుభవార్త చెప్పారు. క్యాన్సర్‌ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి నూతనంగా నిర్మించిన ఆంకాలజీ బ్లాక్‌ను మంత్రి హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంఎన్‌జే ఆసుపత్రిలో నూతన బ్లాకుల ప్రారంభం సంతోషించ దగ్గ విషయం అని అన్నారు. ఇది మాత్రమే కాకుండా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటు చేశామని అన్నారు. చికిత్స నిమిత్తం ఇందులో చేరిన వారికి ఆరోగ్య శ్రీ కింద జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తామని మంత్రి తెలియజేశారు.

కొత్త బిల్డింగ్‌తో ఆస్పత్రిలో పడకల సంఖ్య 750 కి పెరిగిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లను ఖర్చుచేసి ఇక్కడ అన్ని సదుపాయలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని అన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే వంటి పెద్ద హాస్పిటళ్లను బలోపేతం చేశారని అన్నారు. రాష్ట్రంలో నాలుగు టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణతో 10వేల పడకలు సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్