26.2 C
Hyderabad
Friday, January 16, 2026
spot_img

సచివాలయంలో అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉద్యోగులందరు సమన్వయంతో పనిచేసినప్పుడే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారిగా మార్కెట్లవారిగా పనుల పురోగతి, పత్తి మరియు మిర్చి పంటల కొనుగోళ్లకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన పనుల పురోగతి అంత ఆశాజనకంగా లేవని అన్నారు. ప్రతి నెలకోసారి పనుల పురోగతిని సమీక్షించి, నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఇప్పటిదాకా 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ లక్ష్యంగా పెట్టుకొని, 18 లక్షల మెట్రిక్ టన్నలు పత్తిని మద్ధతు ధరకు సేకరించామని అధికారులు తెలిపారు. వివిధ రకాల పంట ఉత్పత్తుల అమ్మకాలలో రైతుల పక్షాన ఉండి, వారికి గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. ఫిర్యాదుల విభాగానికి అందే సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా సూచించారు. రైతుల హక్కుల పరిరక్షించే బాధ్యత మార్కెటింగ్ శాఖ అధికారుల మీద ఉందని, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి పనిచేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్