మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇవాళ సందర్శిం చనున్నారు. తొలుత సుం దిల్ల, అన్నారం బరాజ్లను పరిశీలించి అనంతరం మేడిగడ్డ బరాజ్ను సందర్శిస్తారు. NDSA నిపుణుల కమిటీ మధ్యంతర సిఫారసుల మేరకు 3 బరాజ్ల రక్షణకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. నిర్మాణ ఏజెన్సీలు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పనులను ఈఎన్సీ అనిల్కుమార్, నాగేందర్రావు ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించనున్నారు.


