23.7 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

జేసీపై మంత్రి సత్యకుమార్‌ ఫైర్‌.. బీజేపీకి ఏం సంబంధం?

జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని.. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని ఆగ్రహించారు. ఎక్కడో బస్సు కాలిపోతే బిజెపికి ఏం సంబంధం అని ఫైర్ అయ్యారు. బీజేపీ దేశవ్యాప్తంగా పరిపాలిస్తున్న పార్టీ అన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
గతంలో ప్రభాకర్ రెడ్డి బస్సులపై , వ్యాపారాలపై,అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడనని చెప్పారు మంత్రి సత్య కుమార్ యాదవ్. కూటమిలో భాగస్వామి అయిన, బిజెపి గురించి ఇలా మాట్లాడకూడదని చురకలు అంటించారు. వ్యక్తిగత సమస్యలు తీసుకువచ్చి, రాష్ట్ర సమస్యలాగా మాట్లాడకూడదన్నారు. అర్థంపర్థం లేని విమర్శలు ,బిజెపి మీద చేయడం సరికాదని ఆగ్రహించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్