స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాదెండ్ల మండలం తూబాడులో ఫ్యామిలీ డాక్టర్ విధానంపై స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మంత్రి క్షేత్ర స్థాయి పనితీరును పరిశీలించారు. పేషెంట్ నాయుడు కోటయ్య ఇంటికి వెళ్ళి.. ఫ్యామిలీ డాక్టర్ వచ్చి వెళ్ళాడా లేదా అని రోగి బంధువులను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో రోగి బంధువులు మాట్లాడుతూ తమకు వైద్యం సకాలంలో అందుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు.