ఖమ్మం(Khammam) జిల్లా చీమలపాడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం(ex-gratia) ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలతో పాటు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికత్స సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. కాగా ఇవాళ ఉదయం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాల్సి ఉండగా.. కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో గుడిసెలోని సిలిండర్లు పేలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Read Also: ఖమ్మం ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. బాధితులకు హామీ
Follow us on: Youtube, Koo, Google News